Sunday, 29 June 2014

శాలువా చేసుకున్న పాపమేమి బావా

విందుగాడు మా బావ. వాడికి తెలుగు మీద నాకు మించిన వెర్రి ఉంది. తెలుగు సాహిత్యం మీద, మన పురాణాలమీద చిత్ర విచిత్రమైన సందేహాలు కొకల్లలుగా వస్తుంటాయి. వాటిలో ఒకటి 'దుశ్శాలువ సందేహం'.
ఒకరోజు వాడు నాకు టెలిఫోన్ చేసి ఇలా అడిగాడు. 'బావా సాధారణంగా మనం 'దు ' అనే అక్షరాన్ని చెడుకు సంకేతంగా వాడుతాం కదా మరి ఎవరినైన సత్కరించేటప్పుడు దుశ్శాలువాతో సత్కరించారు అంటారే? శాలువా చేసుకున్న పాపమేమి బావా? ' అని.
నేను నలుగురైదుగురు ఉద్దండులైన పండితులనడిగి తెలుసుకున్న ఒక కథ వాడికి వినిపించి వాడి నోటికి ఆ నాటికి కళ్ళెం పడిపించా. అదే కథని ఇక్కడ పంచుకుంటున్నా.
శాలువా సంస్కారం భారతీయులకు కాశ్మీర దేశం నుండి దిగుమతి అయ్యింది. పూర్వం కాశ్మీర పండితులంటే మంచి విలువ ఉండేది, వారిని రెండు దుస్తులతో సత్కరించే అచారం ఉండేది. కాశ్మీరీ భాషలో రెండుని 'దు ' అంటారట(బహుశా సంసృతపు ద్వ మాతృపదం కావచ్చు) , శాలువా అంటె ఇక సరే సరి. రెండు దుస్తులతో సత్కరించడాన్ని దుశ్శాలువా అనడం పరిపాటి అయిపోయింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...